మియాపూర్ ​మెట్రో స్టేషన్​ కింద కారు దగ్ధం

మియాపూర్ ​మెట్రో స్టేషన్​ కింద కారు దగ్ధం

మియాపూర్, వెలుగు:మియాపూర్, వెలుగు: రన్నింగ్ కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. మెదక్ జిల్లా మనోహరాబాద్​మండలం కుంచారం గ్రామానికి చెందిన దుర్గం అరుణ్​కుమార్​శనివారం తన కారులో ఫ్రెండ్​తో కలిసి పటాన్​చెరు వెళ్లాడు. సాయంత్రం 6 గంటలకు మేడ్చల్​బయలుదేరాడు. మియాపూర్​మెట్రో స్టేషన్ సమీపంలోకి రాగానే వీరి కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అరుణ్​కుమార్, అతని ఫ్రెండ్​తో వెంటనే పక్కకు ఆపి, కారు దిగి ఫైర్​స్టేషన్​కు సమాచారం ఇచ్చారు. అయితే క్షణాల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. మెట్రో సిబ్బందిని సాయమడిగినా స్పందించలేదని, ఫైర్ ఆర్పే సామాగ్రి ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని అరుణ్​కుమార్​ వాపోయాడు.