రాజేంద్రనగర్ PVNR ఎక్స్‌ప్రెస్వే పై కారు బీభత్సం

రాజేంద్రనగర్ PVNR ఎక్స్‌ప్రెస్వే పై  కారు  బీభత్సం

రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్( PVNR) ఎక్స్‌ప్రెస్ వే పై  కారు  బీభత్సం సృష్టించింది.  పిల్లర్ నెంబర్ 285  దగ్గర అదుపు తప్పి ఢివైడర్ ను ఢీ కొట్టిన కారు అపోజిషన్ లో వెళ్తున్న మరో కారును ఢీ కొట్టింది.   ఈ ఘటనలో కారులో వెళ్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.   స్థానికులు హుటాహుటిన  వారిని ఆసుపత్రికి తరలించారు .

శంషాబాద్ నుంచి ఎక్స్‌ప్రెస్ వే మీదుగా మెహదీపట్నం  వైపు  వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంతో ఒక్కసారిగా వాహనదారులు ఒక్కసారిగా  భయబ్రాంతులకు గురయ్యారు. కారు ఆగి పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.  మద్యం మత్తులో కారు నడుపుతున్నట్లు  సమాచారం.  ప్రమాదంతో ఎక్స్‌ప్రెస్ వే పై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు  క్లీయర్ చేశారు. 

ALSO READ | డబ్బులు కట్టాల్సిందే: పార్కింగ్ ఫీజుపై హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటన