హైదరాబాద్ లో కారు బీభత్సం.. తప్పతాగి మనిషిని గుద్ది చంపిన వ్యక్తి

హైదరాబాద్ లో కారు బీభత్సం.. తప్పతాగి మనిషిని గుద్ది చంపిన వ్యక్తి

హైదరాబాద్ లో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై వెళ్తున్న కారు అదుపుతప్పి పక్కనే పాలు అమ్ముతున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చనిపోగా.. మరొకరికి తీవ్రగాయాలు   అయ్యాయి. తెల్లవారుజామున 4గంటలకు జరిగిన  కియా కార్నివల్ కారు డ్రైవర్ చేస్తున్న వ్యక్తి మద్యం మత్తులో వేగంగా రోడ్డు పక్కనున్న పాల వ్యాపారి మీదకు దూసుకెళ్లింది. మద్యం తాగి స్పీడ్ గా వెళ్లడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.