లోయలోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి

లోయలోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఘోర కారు ప్రమాదం చోటుచేసుకుంది. కారు లోయలో పడి ఐదుగురు మరణించారు. మృతులు శనివారం రాత్రి బారోట్‌లో ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం కారు శిథిలాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

కారు నిట్టనిలువుగా 200 అడుగుల లోతైన చౌహార్ లోయలో పడినట్లు పోలీసులు తెలిపారు. నిట్టనిలువుగా పడటంతో కారు నుజ్జునుజ్జయింది. మృతులలో ఒకరు మైనర్(16) ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన వారంతా 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులని వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

ALSO READ | అమెరికా వీసాకోసం సర్టిఫికెట్ ఫోర్జరీ కేసు..ఇద్దరు హైదరాబాదీలు అరెస్ట్