
హైదరాబాద్సిటీ, వెలుగు: తాగునీటి సరఫరాలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, వాటర్లాగింగ్పాయింట్లపై ఫోకస్పెట్టాలని మున్సిపల్ప్రిన్సిపల్సెక్రటరీ ఎం.దానకిశోర్ అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో సోమవారం వాటర్బోర్డు ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీవేజ్ మేనేజ్మెంట్, తాగునీటి సరఫరాలో ఎదురయ్యే సమస్యలను దూరం చేసేందుకు జీఎం, డీజీఎం, మేనేజర్లు, ఇతర సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పారు. తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు వహించాలని చెప్పారు.