
హైదరాబాద్సిటీ, వెలుగు: సంక్రాంతి వేళ ఆర్టీఏ ఎన్ఫోర్స్మెంట్అధికారులు హైవేపై తనిఖీలు నిర్వహించి భారీ సంఖ్యలో కేసులు నమోదు చేశారు. ఒక్క హైదరాబాద్పరిధిలోనే గతవారం రోజులుగా కాంట్రాక్టు క్యారేజ్బస్సులపై 317 కేసులు నమోదు చేసినట్టు ట్రాన్స్పోర్ట్ జాయింట్కమిషనర్ రమేశ్కుమార్ శనివారం తెలిపారు. సెంట్రోల్జోన్పరిధిలో టాక్స్లు చెల్లించని, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 43 బస్సులపై, ఈస్ట్జోన్లో 50 బస్సులు, వెస్ట్జోన్లో 30 బస్సులు, నార్త్జోన్లో 48 బస్సులు, సౌత్జోన్ లో 72 ప్రైవేట్ ట్రావెల్స్బస్సులపై కేసులు నమోదు చేశారు. నాగోల్డ్రైవింగ్టెస్ట్ట్రాక్ పరిధిలో వాణిజ్య ఉత్పత్తుల రవాణా, ఫైర్సేఫ్టీ లేని, డ్రైవర్లకు యూనిఫారం లేని బస్సులకు సంబంధించి 74 కేసులు నమోదు చేశారు. వీరి నుంచి రూ.1,11,000ను పెనాల్టీగా వసూలు చేశామన్నారు. అటు మేడ్చల్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల పరిధిలో 415 ప్రైవేటు బస్సులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.