మాజీ ఎమ్మెల్యే అనుచరుడిపై కేసు నమోదు

మాజీ ఎమ్మెల్యే అనుచరుడిపై కేసు నమోదు

వరంగల్: కుడా మాజీ డైరెక్టర్​, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రధాని అనుచురుడు మోడం ప్రవీణ్ పై కేసు నమోదైంది. వరంగల్​ కు చెందిన రాంబాబుకు డబుల్​బెడ్​రూమ్​, వరంగల్​ మున్సిపల్​ కార్పోరేషన్​లో జవాన్​గా జాబ్​ ఇప్పిస్తానని రూ. 5 లక్షలు ప్రవీణ్​ తీసుకున్నాడు. రాంబాబుకు డబుల్​బెడ్​రూమ్​ ఇల్లు, ఇటూ జాబ్​ రాలేదు. దీంతో ప్రవీణ్​ను చాలాసార్లు అడుగగా..  డబ్బులు తిరిగి ఇచ్చేది లేదని.. గట్టిగా అడుగుతే చంపేస్తానని బెదిరింపులకు గురి చేశాడు. దీంతో రాంబాబు పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి కంప్లైట్​ మేరకు 318(4) 115(2), 296, 351(2) BNS సెక్షన్ల కింద  ప్రవీణ్​పై  కేసులు  నమోదు చేశారు.

ALSO READ | కమీషన్లు తీసుకుని సాకులు చెబుతున్రు:ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి​ ​