11 మంది యూట్యూబర్లపై కేసులు

11 మంది యూట్యూబర్లపై కేసులు
  • బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ఎఫ్ఐఆర్ 
  • వాళ్లందరినీ విచారించేందుకు పోలీసుల ఏర్పాట్లు 

హైదరాబాద్ సిటీ/పంజాగుట్ట వెలుగు: యువత ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్‌‌ యాప్స్‌‌ను ప్రమోట్‌‌ చేసిన 11 మంది సోషల్‌‌ మీడియా ఇన్‌‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, సెలబ్రెటీలపై పంజాగుట్ట పోలీసులు సోమవారం కేసులు నమోదు చేశారు. వీరిలో యాంకర్లు విష్ణుప్రియ, శ్యామలతో పాటు హర్షసాయి, ఇమ్రాన్ ఖాన్, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, రీతూ చౌదరి, బండారు శేషాయని సుప్రిత, సుధీర్, అజయ్, సన్నీ యాదవ్ ఉన్నారు. 

వీరిపై పలు సెక్షన్లు, యాక్ట్‌‌ కింద కేసులు పెట్టారు. ఇప్పటికే సేకరించిన యాప్‌‌ లింక్స్ ఆధారంగా వీరికి నోటీసులు ఇచ్చి విచారించేందుకు చర్యలు ప్రారంభించారు. కాగా, హైదరాబాద్‌‌లోని మియాపూర్‌‌‌‌కు చెందిన వినయ్‌‌ తన ఫ్రెండ్స్‌‌తో కలిసి అమీర్‌‌‌‌పేట్‌‌లో కోచింగ్‌‌ తీసుకుంటున్నాడు. 

స్నేహితులతో కలిసి సోషల్‌‌మీడియాలో బెట్టింగ్‌‌ యాప్స్‌‌ గుర్తించాడు. ఈ ఇల్లీగల్ యాప్స్‌‌ను సోషల్ మీడియాలో సెలబ్రెటీలు ప్రమోట్ చేస్తున్నారని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తను కూడా ఇలాంటి యాప్స్‌‌కు ప్రభావితమైనట్టు అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు.