
బతుకమ్మ వేడుకల్లో డీజే ఉపయోగించినందుకు గానూ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు మరో ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీసులు సుమోటాగా కేసు నమోదు చేశారు. నిర్దేశిత నమయం దాటిన తరువాత పెద్ద సౌండ్తో డీజే పెట్టారని ఎఫ్ఐఆర్లో పొందు పరిచారు. మేయర్తో పాటు నిర్వాహకులు విజయ్కుమార్, గౌస్ ల మీద కేసు నమోదయ్యింది.