
చేవెళ్ల, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలను బీఆర్ఎస్ నాయకులు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాల్లో ఆసత్య ప్రచారం చేశారంటూ 4 రోజుల క్రితం మొయినాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మళి మాణెయ్య మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
కేటీఆర్ సూచనలతోనే సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలను మార్ఫింగ్ చేసి బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాల్లో వైరల్ చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజ య్ రావు పై కేసు నమోదు చేసినట్లు సీఐ పవన్ కుమార్ రెడ్డి తెలిపారు.