![బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కొత్త చట్టం కింద కేసు నమోదు](https://static.v6velugu.com/uploads/2024/07/case-has-been-registered-against-brs-mla-kaushik-reddy-under-the-new-law_UI4MKxNQzP.jpg)
కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో కలెక్టర్ సహా అధికారుల విధులకు ఆటంకం కలిగించిన అభియోగాలపై హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై కరీంనగర్ వన్ టౌన్ లో కేసు నమోదైంది. బీఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 221, 126(2) కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదైన తొలి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కావడం విశేషం. జిల్లా పరిషత్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు చర్యలు చేపట్టారు. జులై 03వ తేదీ మంగళవారం జరిగిన జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహారించిన తీరుపై జడ్పీ సీఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి బయటికి వెళ్ళే సమయంలొ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకుని.. వెళ్లకుండా అడ్డుగా బైఠాయించారు.