ఫేక్​ సర్టిఫికెట్లతో డాక్టర్​గా చెలామణి

ఫేక్​ సర్టిఫికెట్లతో డాక్టర్​గా చెలామణి

మియాపూర్, వెలుగు: ఫేక్​సర్టిఫికెట్లతో ఓ హాస్పిటల్​లో పిల్లల డాక్టర్​గా పని చేసిన వ్యక్తిపై కేసు నమోదైంది. మియాపూర్​పోలీసుల వివరాల ప్రకారం..  గత నెల 19న రాష్ట్ర మెడికల్​కౌన్సిల్​విజిలెన్స్​ఆఫీసర్​డాక్టర్​విష్ణు ఆధ్వర్యంలో అధికారులు మియాపూర్​మదీనాగూడలోని అంకుర హాస్పిటల్​లో తనిఖీలు నిర్వహించారు. పీడియాట్రిషియన్​గా చేస్తున్న కలపాల భరత్​కుమార్ సర్టిఫికెట్లు నకిలీవని, ఎలాంటి అర్హత లేకున్నా డాక్టర్ గా వైద్యం అందిస్తున్నట్లు గుర్తించారు. అతను డాక్టర్​భైరం భరత్​కుమార్​కు చెందిన రిజిస్ట్రేషన్​నంబర్​వాడుతున్నట్లు తేల్చారు.

యాజమాన్యం సర్టిఫికెట్లు పరిశీలించకుండానే భరత్​కుమార్​ను జాయిన్​చేసుకున్నట్లు తెలిసింది. మెడికల్​కౌన్సిల్ రిజిస్ట్రార్ లాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.