
నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో క్లినిక్లు నడుపుతున్న 11 మంది నకిలీ డాక్టర్లపై కేసులు నమోదు చేశామని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. బాన్సువాడ పట్టణానికి చెందిన బొడ్డు వెంకట్రెడ్డి, వి.సురేశ్, ఎం.ప్రకాశ్, డిచ్పల్లికి చెందిన ఆర్. రాజశేఖర్, ఎం.వెంకటేశ్వర్, ఎస్.దత్తాత్రి, గోలి సందీప్, ఇందల్వాయికి చెందిన కానుల గంగాధర్, ముప్కాల్ స్టేషన్ పరిధిలో సూర మహేశ్కుమార్, ఎం.విఠల్సింగ్, నిజామాబాద్ 5వ టౌన్లో మల్లేశంపై కేసు నమోదు చేయించామని చెప్పారు. సరైన విద్యార్హతలు లేకుండా రాష్ట్రంలో క్లినిక్లు నడిపించడంతో మరణాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించామని చెప్పారు. నవంబర్ 27న ఉమ్మడి జిల్లాలో దాడులు నిర్వహించి 11 మంది నకిలీ డాక్టర్లను గుర్తించామని తెలిపారు.