మోసం చేశాడు.. యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు..!

మోసం చేశాడు.. యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు..!

హైదరాబాద్: యూట్యూబర్ హర్ష సాయిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్‎లో కేసు నమోదు అయ్యింది. ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడని హర్ష సాయిపై ఓ యువతి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.2 కోట్లు తీసుకున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఇవాళ (సెప్టెంబర్ 24) అడ్వకేట్‎తో కలిసి నార్సింగి పీఎస్‎కి వచ్చిన బాధితురాలు.. హర్ష సాయితో పాటు అతడి తండ్రి‎పైన కంప్లైంట్ చేసింది.

ALSO READ | జానీకి బెయిలా.. కస్డడీనా..? రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ

 బాధితురాలి ఫిర్యాదు మేరకు హర్ష సాయిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. హర్షసాయిపై ఫిర్యాదు చేసిన యువతి ప్రముఖ టెలివిజన్ రియాల్టీ షో బిగ్ బాస్ షోలో కూడా పార్టిసిపేట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, పేదవారికి ఆర్థికంగా సహయం అందిస్తూ.. ఆ వీడియోలను యూట్యూబ్‎లో అప్ లోడ్ చేస్తూ వ్యూయర్స్‎ను ఆకట్టుకుని హర్ష సాయి ఫేమ్ సంపాదించుకున్నాడు.

ALSO READ | లైంగిక వేధింపుల కేసులో మరో నటుడు అరెస్ట్..

 యూట్యూబ్ ద్వారా గుర్తింపు పొందిన హర్షసాయి హీరోగాను నటించాడు. మెగా అనే మూవీలో హర్ష సాయి హీరోగా యాక్ట్ చేశాడు. అయితే, మూవీని కూడా నిర్మించింది ప్రస్తుతం ఫిర్యాదు చేసిన యువతే కావడం గమనార్హం. పేదలకు సాయం చేస్తూ పేరు పొందిన సాయిపై చీటింగ్ కేసు నమోదు కావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‎గా మారింది.