థ్రిల్లింగ్​ కంటెంట్‌‌‌‌తో 'ఫణి'.. చాలా కాలం తర్వాత మెగాఫోన్ పట్టిన డైరెక్టర్ వీఎన్‌‌‌‌ ఆదిత్య

థ్రిల్లింగ్​ కంటెంట్‌‌‌‌తో 'ఫణి'.. చాలా కాలం తర్వాత మెగాఫోన్ పట్టిన డైరెక్టర్ వీఎన్‌‌‌‌ ఆదిత్య

కేథరిన్ థ్రెసా హీరోయిన్‌‌‌‌గా వీఎన్‌‌‌‌ ఆదిత్య దర్శకత్వంలో పూర్తిగా అమెరికా నేపథ్యంలో ఓ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈచిత్రానికి ‘ఫణి’ అనే టైటిల్‌‌‌‌ను ఖరారు చేశారు.

అమెరికాలోని డల్లాస్‌‌‌‌లో జరిగిన ఈవెంట్‌‌‌‌లో ఓ.ఎమ్.జీ ప్రొడక్షన్స్ బ్యానర్ లోగోను నిర్మాత అనిల్ సుంకర , చిత్ర టైటిల్‌‌‌‌ను డా.తోటకూర ప్రసాద్‌‌‌‌ ఆవిష్కరించారు. తన కెరీర్‌‌‌‌‌‌‌‌లోనే మోస్ట్ ఛాలెంజింగ్‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ను ఇందులో పోషించానని చెప్పిన కేథరిన్.. త్వరలోనే ఓ మంచి థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌తో ప్రేక్షకుల ముందుకొస్తామని చెప్పింది.

వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ ‘కథ చెప్పగానే కొత్త ప్రొడక్షన్ హౌస్‌‌‌‌ అయినప్పటికీ వెంటనే ఓకే చెప్పిన కేథరిన్ ధైర్యానికి అభినందనలు. మ్యూజిక్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా నాకు బాగా తెలిసిన మీనాక్షి.. ఈ చిత్రంతో నిర్మాత అవడం హ్యాపీ’ అని చెప్పారు.

‘ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయింది.  మిగతా షూట్ పూర్తి చేసి, త్వరలోనే పాన్ ఇండియా రిలీజ్‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నాం’ అని నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్ మీనాక్షి తెలిపారు.  నటీనటులు నేహాకృష్ణ, మహేష్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

టాలీవుడ్ కు మనసంతా నువ్వే, ఆట, బాస్, నేనున్నాను వంటి పలు సూపర్ హిట్ చిత్రాలను అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు వీఎన్ ఆదిత్య.  లాంగ్ గ్యాప్ తర్వాత ఈ దర్శకుడు కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.