
సదాశివపేట, వెలుగు : సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని సైకిల్ రిపేర్షాపు, మండల పరిధిలోని ఆరూర్ గ్రామ శివారులో ధరణి వాటర్ ప్లాంట్లో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నారన్న సమాచారంతో బుధవారం సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు 489 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసి, అక్రమ రిఫీల్లింగ్ కు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్టు చేశారు. సీసీఎస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సదాశివపేట కు చెందిన ధరణి వాటర్ ప్లాంట్ యజమాని తులసి రాజేందర్
ఉదయ్రాజ్పాల్, మన్నె సతీశ్ అక్రమ గ్యాస్ ఫిల్లింగ్దందా నిర్వహిస్తున్నారు. సదాశివపేట పట్టణంలోని అబ్దుల్ సలీం గాంధీచౌక్ వద్ద సైకిల్ రిపేర్ షాపు నడుపుతూ షాపు లోపల అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో దాడులు నిర్వహించి మొత్తం బుడ్డీలు, రీఫిల్లింగ్ సామాన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.