నాలుగు నెలల కింద మహిళ మిస్సింగ్ కాన్పూర్లో శవమై తేలింది

నాలుగు నెలల కింద మహిళ మిస్సింగ్ కాన్పూర్లో శవమై తేలింది
  • మరో యువతితో పెండ్లి వద్దన్నందుకు చంపేసిన ప్రియుడు
  • యూపీలో వీడిన మహిళ మిస్సింగ్, మర్డర్​ మిస్టరీ

న్యూఢిల్లీ: నాలుగు నెలల కింద కనిపించకుండా పోయిన మహిళ ఉత్తరప్రదేశ్​(యూపీ) రాష్ట్రం కాన్పూర్లోని వీవీఐపీ ఏరియాలో శవంగా బయటపడింది. పోలీసులు ఆమెను ఢిల్లీకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్​ భార్య ఏక్తాగా గుర్తించారు. ఆమెను ప్రియుడు విమల్​ సోనీ హ్యత చేసినట్లు గుర్తించారు. 

కాన్పూర్​లోని ప్రభుత్వ ఉన్నతాధికారుల బంగ్లాలు ఉండే రాయ్​పూర్వా ఏరియాలో పనుల నిమిత్తం తవ్వుతుండగా ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. నాలుగు నెలల కింద మిస్సింగ్ కేసుగా నమోదైన ఏక్తా శవంగా గుర్తించారు. గ్రీన్​పార్క్​ ఏరియాలో ఉండే జిమ్ ట్రైనర్​విమల్ సోనీతో ఆమె సన్నిహితంగా ఉండేదని గుర్తించారు. చివరిసారిగా ఏక్తా అతన్ని కలిసినట్టు ఎంక్వైరీలో తేలింది.

విమల్ సోనీకి వేరే యువతితో పెండ్లి నిశ్చయం కావడంతో ఆమె అతను ఉండే జిమ్​కు వెళ్లి నిలదీసింది. వారి మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత వారిద్దరు జిమ్ నుంచి బయటకు వచ్చి కారులో వెళ్లిపోయారు. వాహనంలో కూడా ఆ యువతి పెండ్లి విషయంపై విమల్ తో ఏక్తా గొడవకు దిగింది. దీంతో ఆమె మెడపై విమల్ బలంగా కొట్టాడు. ఏక్తా స్పృహ తప్పింది.

ఆ తర్వాత ఆమెను విమల్ హత్య చేసి కాన్పూర్​ రాయ్​పూర్వా ఏరియాలో మృతదేహాన్ని పాతిపెట్టాడు. తర్వాత నిందితుడు కూడా సిటీ వదిలి వెళ్లిపోయాడు. అతను తన మొబైల్ ఫోన్ కూడా వాడకుండా కొద్దిరోజుల పాటు పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరిగాడు. చివరకు పోలీసులు అతన్ని పట్టుకొని విచారించగా ఏక్తాను హత్య చేశానని నిందితుడు అంగీకరించాడు. కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై  కేసు నమోదు చేశారు.