దేవరగుట్టపై సీసీ కెమెరాల ఏర్పాటు .. చిరుతల కదలికలు తెలుసుకునేందుకు ఫారెస్ట్​​ ఆఫీసర్ల యత్నం

దేవరగుట్టపై సీసీ కెమెరాల ఏర్పాటు .. చిరుతల కదలికలు తెలుసుకునేందుకు ఫారెస్ట్​​ ఆఫీసర్ల యత్నం

నవాబుపేట, వెలుగు: మండలంలోని యన్మన్​గండ్ల గ్రామ మీపంలోని దేవరగుట్టపై సంచరిస్తున్న చిరుతల కదలికలు తెలుసుకునేందుకు ఫారెస్ట్​ అధికారులకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వారం రోజులుగా పదికి పైగా కుక్కలను, శుక్రవారం తెల్లవారుజామున కోస్గి కిష్టయ్య ఆవుల షెడ్డులో నుంచి లేగదూడను ఎత్తుకెళ్లడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఫారెస్ట్​ ఆఫీసర్లు చిరుతలను బంధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దేవరగుట్ట పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

 అనంతరం గ్రామస్తుల సాయంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుతల కదలికలు తెలుసుకునేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, మూమెంట్స్​ తెలిసిన అనంతరం బోన్​లను ఏర్పాటు చేసి చిరుతలను బంధించి తరలిస్తామని ఫారెస్ట్​ ఆఫీసర్లు తెలిపారు. గ్రామస్తులు, రైతులు గుట్ట పరిసరాల్లోకి వెళ్లవద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.