
న్యూఢిల్లీ: కంపెనీల్లో ఉన్నత స్థానాలకు ఎదగాలంటే మహిళా ఉద్యోగులు సవాళ్లను ఎదుర్కోవాలని, రిస్క్ తీసుకోవాలని నిపుణులు సూచించారు. వ్యాపార సంస్థల్లో మహిళలు ఉన్నతస్థానాలను చేపట్టడానికి ఉన్న సమస్యలపై చర్చించడానికి సీడీకే గ్లోబల్, సీఐఐ ఇండియన్ విమెన్ నెట్వర్క్(ఐడబ్ల్యూఎన్)తో కలసి హైదరాబాద్లో శనివారం ప్యానెల్ డిస్కషన్నిర్వహించాయి. వ్యాపార రంగంలో వారికి ఉన్న అవకాశాలపై, అవరోధాలపై ఈ సందర్భంగా నిపుణులు చర్చించారు.
ఐడబ్ల్యూఎన్ తెలంగాణ వైస్–చైర్మన్ హేమా శ్రీనివాస్ మాట్లాడుతూ అంతర్జాతీయంగానూ సీనియర్ లీడర్షిప్ స్థానాల్లో మహిళలకు సమాన అవకాశాలు దక్కడం లేదన్నారు. ఇండియాలో పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని విమర్శించారు. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడకపోవడం, పక్షపాత కారణంగా ఇలా జరుగుతోందని చెప్పారు.
ఈ సమస్యలను పరిష్కరించాలని, మహిళలు ఎదిగేందుకు తగిన వాతావరణాన్ని సృష్టించాలని అన్నారు. ఐబీఎం ఎగ్జిక్యూటివ్ పార్ట్నర్ లక్ష్మీనాయర్ మాట్లాడుతూ మహిళలు రిస్క్ తీసుకోవడానికి వెనకడుగు వేయవద్దని, కెరీర్కోసం స్పాన్సర్లను, మెంటార్లను సంపాదించుకోవాలని సూచించారు.