
దేశవ్యాప్తంగా లోక్ సభ ఆరో విడత ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుంది. 6 రాష్ట్రాలు, 2 యూటీల్లో 58 స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 889 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. ఆరో ఫేజ్లో మొత్తం 11.13 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కొంతమంది ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
#WATCH | President Droupadi Murmu casts her vote for #LokSabhaElections2024 at a polling booth in Delhi pic.twitter.com/O8wB4aLBLG
— ANI (@ANI) May 25, 2024
రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూ ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ కర్ ఆయన సతీమణితో కలిసి పోలింగ్ బూత్ దగ్గర క్యూ లైన్ లో నిల్చొని ఓటు వేశారు. జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ, మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్, ఆప్ మినిస్టర్ అతిషి ఢిల్లీలో ఓటు వేశారు. హర్యాణ మాజీ సీఎం మనోహర్ లాల్ కట్టర్ ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
#WATCH | External Affairs Minister Dr S Jaishankar casts his vote at a polling booth in Delhi, for the sixth phase of #LokSabhaElections2024 pic.twitter.com/SbWDv9jWZc
— ANI (@ANI) May 25, 2024
ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఉదయాన్నే ఓటు వేయడానికి ఓటర్లు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఉదయం ఏడు గంటలనుంచే పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చి క్యూ లైన్ కట్టారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఆయన భార్యతో కలిసి మిర్జాపూర్ లో ఓటు వేశారు.
#WATCH | BJP East Delhi MP and former India Cricketer Gautam Gambhir casts his vote for the sixth phase of #LokSabhaElections2024 at a polling station in Delhi. pic.twitter.com/1dNMGyCoUq
— ANI (@ANI) May 25, 2024
ఢిల్లీలోని 7 స్థానాలల్లో బీజేపీ, ఇండియా కూటమి మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతున్నది. కూటమిలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేస్తున్నది. జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ – రాజౌరీ సెగ్మెంట్లో మొహబూబా ముఫ్తీ పార్టీ నాయకులతో నిరసనకు దిగారు.