![ఫిబ్రవరి 14, 15న ఉప్పల్ స్టేడియంలో సెలబ్రిటీ క్రికెట్ లీగ్](https://static.v6velugu.com/uploads/2025/02/celebrity-cricket-league-at-uppal-stadium-on-february-14-15_HmJAKiq4QO.jpg)
- ఒకే టికెట్ రెండు మ్యాచ్లు చూసే అవకాశం
- భోజ్పురి, చెన్నై టీమ్స్తో తలపడనున్న తెలుగు హీరోస్
- స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన రాచకొండ సీపీ
ఉప్పల్, వెలుగు: సెలబ్రిటీ క్రికెట్ లీగ్–2025లో భాగంగా ఈ నెల 14, 15 తేదీల్లో ఉప్పల్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో నాలుగు మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. ఇందులో రెండు తెలుగు సినీ హీరోల మ్యాచ్లు ఉన్నాయి. 14న మధ్యాహ్నం 2 గంటలకు చెన్నై రినోస్వర్సెస్కర్నాటక బుల్డోజర్స్, సాయంత్రం 6.30కు తెలుగు వారియర్స్వర్సెస్భోజ్పురి దబాంగ్స్మ్యాచ్లు జరగనున్నాయి.15న మధ్యాహ్నం 2 గంటలకు ముంబై హీరోస్ వర్సెస్కర్ణాటక బుల్డోజర్స్, సాయంత్రం 6.30కుతెలుగు వారియర్స్ వర్సెస్చెన్నై రినోస్ మ్యాచ్లు ఉంటాయి.
బుక్మై షో యాప్లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సీపీ సుధీర్బాబు బుధవారం ఉప్పల్స్టేడియంలో స్టేడియం, జీహెచ్ఎంసీ, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులు, సీసీఎల్నిర్వాహకులతో కోఆర్డినేషన్మీటింగ్నిర్వహించారు. సెలబ్రిటీల టీ20 మ్యాచ్లకు అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. అన్నిశాఖల అధికారులు సమన్వయం ముఖ్యమన్నారను. నిబంధనల ప్రకారమే కూల్ డ్రింక్స్, ఫుడ్ఐటమ్స్విక్రయించాలని, స్టేడియం పరిసరాల్లో సీసీ కెమెరాలన్నీ పనిచేసేలా చూడాలన్నారు.
అవసరమైతే కొత్తవి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మీడియా ప్రతినిధులకు, ఇతరులకు ఇచ్చే పాసుల జారీలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా, సీసీఎల్ మ్యాచ్ల కోసం సిటీకి వచ్చిన కన్నడ సూపర్ స్టార్, కర్ణాటక బుల్డోజర్స్ టీమ్ కెప్టెన్ కిచ్చా సుదీప్ తన టీమ్ మేట్స్తో కలిసి బుధవారం సాయంత్రం మెట్రోలో జర్నీ చేశారు.