ఇయ్యాల్టి (ఫిబ్రవరి 17) నుంచి కొడంగల్లో నక్షా సర్వే

ఇయ్యాల్టి (ఫిబ్రవరి 17) నుంచి కొడంగల్లో నక్షా సర్వే

కొడంగల్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన నక్షా పైలట్​సర్వే కొడంగల్ ​మున్సిపాలటీ సోమవారం నుంచి షురూ కానుంది. వ్యవసాయ సాగు భూముల మాదిరిగానే మున్సిపాలిటీల్లో కూడా పక్కాగా సర్వే చేసి నక్షా రూపొందిస్తారు. రెవెన్యూ, మున్సిపల్, సర్వే ఆఫ్​ఇండియా విభాగాల ఆధ్వర్యంలో నక్షా సర్వే చేయనున్నట్టు కొడంగల్ తహసీల్దార్​విజయ్​కుమార్​తెలిపారు.

 మున్సిపాలిటీ పరిధిలోని ఇండ్లు, ఖాళీ స్థలాలు, పట్టా భూములు, ప్రభుత్వ స్థలాల సర్వే చేసి హద్దులు, విస్తీర్ణాన్ని డిజిటల్​పద్ధతిలో రూపొందించడం జరుగుతుందని వివరించారు. నక్షా సర్వే ద్వారా మున్సిపాలిటీలోని ప్రభుత్వ భూముల అక్రమణలు వెలుగులోకి వచ్చే చాన్స్ కూడా ఉందని పేర్కొన్నారు. సర్వే నిర్వహించేందుకు ప్రత్యేక హెలికాప్టర్​ఇప్పటికే కొడంగల్​కు చేరుకుంది.