బీమా రంగంలో 100 % ఎఫ్​డీఐలకు ఓకే

బీమా రంగంలో 100 % ఎఫ్​డీఐలకు ఓకే

న్యూఢిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్​డీఐలు) పరిమితిని 74 శాతం నుంచి 100 శాతానికి పెంచుతామని బడ్జెట్​ సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్ ​ప్రకటించారు. ఇదివరకే ఇండియాలో పెట్టుబడి పెట్టిన బీమా కంపెనీలు ఎఫ్​డీఐ పరిమితిని పెంచుకోవచ్చని చెప్పారు. ఎఫ్​డీఐల కోసం ప్రస్తుతం ఉన్న కండిషన్లను మరింత సరళీకరిస్తామన్నారు. 

ఎఫ్​డీఐ పరిమితిని పెంచడానికి కేంద్ర బీమా చట్టం 1938, లైఫ్​ ఇన్సూరెన్స్​ కార్పొరేషన్​ చట్టం 1956, ఇన్సూరెన్స్​ రెగ్యులేటరీ అండ్​ డెవెలప్​మెంట్​అథారిటీ చట్టం 1999లో మార్పులు తేవాల్సి ఉంటుంది. బీమా రంగంలోకి మరిన్ని కంపెనీలు రావడం వల్ల ఎక్కువ మందికి బీమా ఫలాలు అందుతాయని, ఉద్యోగాలూ పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం మనదేశంలో 25 లైఫ్​ఇన్సూరెన్స్​ కంపెనీలు, 34 నాన్​–లైన్​ ఇన్సూరెన్స్ కంపెనీలు సేవలు అందిస్తున్నాయి.