ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్.. అమరావతి రైల్వే ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్

ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్.. అమరావతి రైల్వే ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‎కు కేంద్ర ప్రభుత్వ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైల్వే అనుసంధాన ప్రాజెక్టుకు తాజాగా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.2,245 కోట్ల వ్యయంతో 57  కిలో మీటర్ల పొడవునా నిర్మించనున్న అమరావతి రైల్వే లైన్‎కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని మోడీ అధ్యక్షతన గురువారం (అక్టోబర్ 24) జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

 అమరావతి రైల్వే నిర్మాణానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసిన విషయాన్ని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా అమరావతికి హైదరాబాద్, చెన్నై, కోల్ కతా నగరాలతో రైల్ కనెక్టివిటి చేయనున్నారు. కొత్త రైల్వే లైన్ నిర్మాణంతో దక్షిణ, మధ్య, ఉత్తర భారత్‎తో ఏపీకి అనుసంధానం పెరగనుంది.

ALSO READ | హైదరాబాద్ ఇండియాలో బెస్ట్ సిటీ : మంగళగిరి డ్రోన్ సమిట్‌లో ఏపీ సీఎం చంద్రబాబు

 ఈ రైల్వే ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై 3.2 కి.మీ పొడవునా రైల్వే బ్రిడ్జి నిర్మించనున్నారు. కాగా, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో ఏపీపై కేంద్ర ప్రభుత్వం వరాలు జల్లు కురిపిస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇటీవల భారీగా నిధులు కేటాయించిన మోడీ సర్కార్.. తాజాగా ఏపీకి మరో శుభవార్త అందించింది.