నెలకు రూ.3వేల పెన్షన్ పొందే కేంద్ర ప్రభుత్వ స్కీం.. అప్లయ్ చేసుకోండిలా..

నెలకు రూ.3వేల పెన్షన్ పొందే కేంద్ర ప్రభుత్వ స్కీం.. అప్లయ్ చేసుకోండిలా..

కేంద్ర ప్రభుత్వం పేదలు, కార్మికులు, వృద్ధులు, మహిళల, చిన్నారులకు కొన్ని వందల పథకాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా కార్మికుల కోసం  ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా 30 కోట్ల మంది అసంఘటిత కార్మికులకు మేలు చేయాలని చూస్తోంది. ఈ-శ్రమలో చేరేందుకు అర్హతలు, ఏవిధంగా అప్లయ్ చేసుకోవాలి వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

కేంద్ర ప్రభుత్వం కార్మికులకోసం తీసుకొచ్చిన స్కీం.. ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్. ఈ- శ్రమ కార్డు పొందిన కార్మికులు 60 ఏళ్ల వయసు వచ్చాక నెలకు రూ. 3000 పెన్షన్ పొందవచ్చు. దీంతో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది. దివ్యాంగులకు ఆర్థిక సాయం కూడా అందుతుంది. 

ఈ-శ్రమ కార్డు అర్హతలు 

ఈ-శ్రమ కార్డు పొందాలంటే.. కార్మికుల శ్రామిక పథకం కింద రిజిస్టర్ చేయించుకుంటే ఈ-శ్రమ కార్డు లభిస్తుంది. దీనికి దరఖాస్తుదారులు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసుండాలి. ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ ఉండాలి 

ఈ-శ్రమ కార్డు ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి 

ఈ -శ్రమ కార్డు కంప్యూటర్, మొబైల్ లోని డౌన్ లోడ్ చేసుకోవచచు. ఆధార్ కార్డు లాగే ఈ కార్డుపై కూడా 12 అంకెల నంబర్ ఉంటుంది. ఇది కార్మికులకు గుర్తింపు కార్డులా పనిచేస్తుంది. ఈ కార్డు డైన్ లోడ్ చేసుకోవడానికి ముందుగా అధికారిక పోర్టల్ https//eshram.gov.in లోకి వెళ్లాలి. తర్వాత ఈ-శ్రమ ట్యాబ్ లో రిజిస్టర్ పై క్లిక్ చేయాలి. అక్కడ మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత కాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. మొబైల్ కి OTP వస్తుంది. దీంతో వెరిఫికేషన్ పూర్తవుతుంది. తద్వారా ఈ-శ్రమ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

ఏవైనా సందేహాలుంటే..హెల్ప్ లైన్ నంబర్ 1443కి కాల్ చేసి సందేహాలపై క్లారిటీ తీసుకోవచ్చు.