నగదు డిపాజిట్లపై ఇన్సూరెన్స్ పరిమితిని పెంచాలని భావిస్తున్న కేంద్రం

నగదు డిపాజిట్లపై ఇన్సూరెన్స్ పరిమితిని పెంచాలని భావిస్తున్న కేంద్రం

ముంబై: నగదు డిపాజిట్లపై ఇన్సూరెన్స్ పరిమితిని మరింత పెంచాలని కేంద్రం భావిస్తోంది. డిపాజిట్లపై ప్రస్తుతం రూ.ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉంది. బ్యాంకు మోసాలు విపరీతంగా పెరుగుతున్నందున ప్రభుత్వం ఈ ప్రతిపాదనను చురుగ్గా పరిశీలిస్తోందని సంబంధిత అధికారి ఒకరు చెప్పారు. న్యూ ఇండియా కో–ఆపరేటివ్ ​బ్యాంకు స్కామ్ ​బయటపడ్డ నేపథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్​ఫైనాన్షియల్ ​సర్వీసెస్ ​సెక్రటరీ ఎం.నాగరాజు డిపాజిట్​ ఇన్సూరెన్స్ పెంపు గురించి చెప్పారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు.