ఎస్ఏఎస్ సీఐ స్కీం కింద ..రెండు ప్రాజెక్టులకు రూ.141.84 కోట్లు

ఎస్ఏఎస్ సీఐ స్కీం కింద ..రెండు ప్రాజెక్టులకు రూ.141.84 కోట్లు
  • కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ

న్యూఢిల్లీ, వెలుగు: ‘స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్  ఫర్  క్యాపిటల్  ఇన్వెస్ట్​మెంట్ (ఎస్ఏఎస్ సీఐ),  డెవలప్​మెంట్​ ఆఫ్  ఐకానిక్  టూరిజం సెంటర్స్ టు గ్లోబల్ స్కేల్’ కింద రాష్ట్రంలోని  2 ప్రాజెక్టులకు కేంద్రం రూ.141. 84 కోట్లను మంజూరు చేసింది. రామప్ప రీజియన్  సస్టెయినబుల్  టూరిజం సర్క్యూట్ కి రూ. 79.74 కోట్లు, సోమశిల వెల్ నెస్​  అండ్  స్పిరిచువల్  రిట్రీట్  నల్లమల్ల ప్రాజెక్టుకు రూ.68.10 కోట్ల నిధులు ఇచ్చింది. ఈ మేరకు గురువారం కేంద్ర పర్యాటక శాఖ ఒక ప్రకటన విడుదల  చేసింది.