ఎస్డీఆర్​ఎఫ్​ కిందే కేంద్ర వరద సాయం

ఎస్డీఆర్​ఎఫ్​ కిందే కేంద్ర వరద సాయం
  • ఇరు రాష్ట్రాలకు కలిపి రూ.3,448 కోట్లు 

న్యూఢిల్లీ, వెలుగు : వరదలతో అతలాకుతలమైన రెండు తెలుగు రాష్ట్రాలకు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ (ఎస్టీఆర్ఎఫ్) కింద సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని  కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్​సింగ్​చౌహాన్​ వెల్లడించారు.  ప్రస్తుతం రాష్ట్రాల వద్ద  ఉన్న రూ. 3,448 కోట్లను ఇందుకు వినియోగించుకోవాలని, ఇందులో కేంద్రం వాటా కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.  

ప్రధాని మోదీ ఆదేశాలతో శుక్రవారం ఏపీ, తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించానని, ఈ సందర్భంగా భారీ వర్షాలతో నష్టపోయిన రైతులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నానని చెప్పారు. బాధిత రైతులకు  కేంద్రం అన్నివిధాలా అండగా ఉంటుందని మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భరోసా ఇచ్చారు.