
- లోక్సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు: వికాస్రాజ్
- 4న ఉదయం 8 గంటలకు పోస్టల్..8.30కి ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలు
- పోస్టల్ బ్యాలెట్కు 276, ఈవీఎం ఓట్ల లెక్కింపు కోసం 1,855 టేబుల్స్
- 12 కేంద్ర బలగాల కంపెనీలతో నాలుగంచెల భద్రత
- యావరేజ్గా 18–20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
- కౌంటింగ్ కోసం దాదాపు14 వేల మంది సిబ్బంది
- ఎలక్షన్ కౌంటింగ్ వివరాలు వెల్లడించిన సీఈవో
హైదరాబాద్, వెలుగు : లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపును నిఘానీడలో అత్యంత పకడ్బందీగా చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్ రాజ్ తెలిపారు. ఈ నెల 4న ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నట్టు తెలిపారు. 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 17 పార్లమెంట్ స్థానాలకు ఓట్ల లెక్కింపు కోసం 34 కౌంటింగ్ లోకేషన్స్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. స్ట్రాంగ్ రూం నుంచి కౌంటింగ్ సెంటర్ వరకు బారికేడ్లు, పటిష్ట భద్రత ఉంటుందని తెలిపారు.
కౌంటింగ్ రోజు ర్యాలీలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ర్యాలీలకు పోలీసులు అనుమతి ఇస్తే చేసుకోవచ్చునని చెప్పారు. బీఆర్కే భవన్లో శనివారం ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సీఈవో వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 12 కేంద్ర బలగాల కంపెనీలతో నాలుగంచెల భద్రత ఉంటుందని పేర్కొన్నారు.
కౌంటింగ్ కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకువెళ్లేందుకు అనుమతి ఉండబోదని స్పష్టం చేశారు. అలాగే, కౌంటింగ్ ఏజెంట్లు, సిబ్బందికి సైతం సెల్ఫోన్స్ అనుమతి ఉండదని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోని ప్రతి మూలను కవర్ చేసేలా సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయని చెప్పారు. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు 276 టేబుల్స్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈవీఎంలకు 120 కౌంటింగ్ హాల్స్లో 1,855 టేబుల్స్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
మొదటి ఫలితం ఉదయం 11 గంటలకు..
లోక్సభ ఎన్నికల మొదటి ఫలితం ఉదయం 11 గంటల నుంచి12 గంటల కల్లా వచ్చే అవకాశం ఉందని వికాస్రాజ్తెలిపారు. చొప్పదండి, యాకుత్పురా, దేవరకొండ.. ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా 24 రౌండ్లలో లెక్కింపు ఉంటుందని చెప్పారు. మరో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆర్మూర్, భద్రాచలం, అశ్వారావుపేటలో అత్యల్పంగా 13 రౌండ్ల లెక్కింపు ఉంటుందని వివరించారు. మిగతా నియోజకవర్గాల్లో 18, 19, 20 వరకు రౌండ్లలో కౌంటింగ్ ఉంటుందని తెలిపారు. సిబ్బంది అందరికీ లెక్కింపు ప్రక్రియపై శిక్షణ ఇచ్చినట్టు వికాస్ రాజ్ తెలిపారు.
కౌంటింగ్ కేంద్రాల్లో 2,414 మందికి పైగా మైక్రో అబ్జర్వర్లు ఉంటారని తెలిపారు. ఓట్ల లెక్కింపులో దాదాపు 10 వేల మంది సిబ్బంది పాల్గొంటారని, సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు సిబ్బందిని ర్యాండమ్గా కేటాయిస్తామని చెప్పారు. లెక్కింపు రోజు ఉదయం 5 గంటలకు మరోసారి ర్యాండమ్గా సిబ్బందిని కేటాయిస్తామని తెలిపారు. అదనపు సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా జరిగేలా రాజకీయ నేతలు, ప్రజలు సహకరించాలని కోరారు. కౌంటింగ్ రోజున మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని వెల్లడించారు.