
మంచిర్యాల జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగను పట్టుకున్నారు. చెన్నూరు పాతబస్టాండ్ సెంటర్ లో వృద్దురాలి మెడలో గొలుసు దొంగతనం కేసును పోలీసులు చేధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .... మూడు రోజుల క్రితం ( మార్చి 13 నాటికి) చెన్నూరు పాత బస్టాండ్ సెంటర్ లో చోరీ జరిగింది. బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు చెన్నూరుతో సహా మంచిర్యాల జిల్లాలో పోలీస్ గస్తీ పెంచారు.
దొంగలపై నిఘా వేసిన అధికారులు అలెపు కృష్ణ అనే వ్యక్తి అనుమానాస్పదంగా సంచరించడంతో పట్టుకున్న పోలీసులు.. అతని నుంచి రెండు తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకొని .. కేసు నమోదుచేశామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. నిందితునిపై బీఎన్ఎస్ చట్టం ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. దొంగలను అరికట్టడంలో ప్రతిభ కనపర్చిన పోలీసులకు డీసీపీ భాస్కర్ రివార్డ్ లు అందజేశారు.