వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో చైన్ స్నాచర్లు హల్చల్ చేశారు. వీరభద్ర కిరణాషాపు యజమాని రత్నమాల అనే మహిళ మెడలోంచి పుస్తెలతాడు లాక్కెళ్లారు. మహిళ ఎదురు తిరగడంతో విదిలించుకొని పారిపోయారు.
స్కూటీపై కిరాణా షాపుకు వచ్చి వాటర్ బాటిల్,సిగరెట్లు కావాలంటూ అడిగి మాటలు చెబుతూ తన మెడలో చైన్ లాగేశారని తెలిపింది బాధిత మహిళ. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.