
నిజామాబాద్, వెలుగు: అద్దెకుంటున్న ఓనర్ ఇంట్లో చోరీ చేయడంతో పాటు జిల్లాలో జరిగిన నాలుగు చైన్ స్నాచింగ్ కేసులు, మూడు బైక్లను అపహరించిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు నగర ఏసీపీ రాజావెంకట్రెడ్డి తెలిపారు. శనివారం తన కార్యాలయంలో మీడియాకు వివరాలను వెల్లడించారు. మహారాష్ట్ర ధర్మాబాద్ రాంనగర్కు చెందిన శేక్ ఇమ్రాన్, నాందేడ్కు చెందిన అమన్, బాసర శారదానగర్ వాసి శేక్ అర్బాజ్ ముఠాగా ఏర్పడి నగరంలో అద్దె ఉంట్లో ఉంటూ చైన్స్నాచింగ్తో పాటు బైక్ చోరీలకు పాల్పడుతున్నారు.
కిరాయికి ఉంటున్న ఇంటి యజమాని ఇంట్లో కూడా చోరీ చేశారు. వీరిపై ఎనిమిది కేసులు నమోదు కాగా, 50 గ్రాముల బంగారం, ఒక బైక్ రికవరీ చేసినట్లు ఏసీపీ తెలిపారు. శ్రీనగర్ కాలనీలో అనుమానాస్పదంగా తిరుగుతున్న శేక్ ఇమ్రాన్, శేక్ అర్బాజ్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నేరాలు ఒప్పుకున్నారన్నారు. అమన్ పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. సమావేశంలో టౌన్ సీఐ శ్రీనివాస్రాజు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ సురేష్, ఫోర్త్ టౌన్ ఎస్సై శ్రీకాంత్ ఉన్నారు.
40 కేసుల్లో నిందితుల అరెస్టు
ఈనెల 5న నగరంలోని శ్రీసాయి బాలాజీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో చోరీకి పాల్పడిన నలుగురు నిందితులు శేక్సాదక్, సురేకర్ ప్రకాష్, శేక్ షాదుల్లా, సాయినాథ్ విఠల్రావు ముక్తేను అరెస్టు చేసి రూ.10.17 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ రాజా వెంకట్రెడ్డి తెలిపారు. వారిపై నగరంలోని పలు స్టేషన్లతో పాటు డిచ్పల్లి, బోధన్, బాన్స్వాడ ఠాణాల్లో చోరీలతోపాటు మర్డర్, అటెంప్ట్ మర్డర్, ఫొక్సో కేసులు కలిపి మొత్తం 40 కేసులు నమోదైనట్లు ఏసీపీ పేర్కొన్నారు. వారి వద్ద నుంచి నగదుతో పాటు ఆటోరిక్షా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.