ఖమ్మం జిల్లాలో రెచ్చిపోతోన్న చైన్​స్నాచర్స్​

ఖమ్మం జిల్లాలో రెచ్చిపోతోన్న చైన్​స్నాచర్స్​

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో చైన్​స్నాచర్స్​రెచ్చిపోతున్నారు. జిల్లా పరిధిలో గంటలోనే మూడు వేర్వేరు చోట్ల చైన్ స్నాచింగ్​ఘటనలు జరిగాయి.  దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇవాళ  ఖమ్మం జిల్లా పెనుబల్లి, కల్లూరుమండలంలో మూడు చోట్ల  చైన్ స్నాచింగ్  జరిగాయి.  మధిర మండలం సిరిపురం నుండి బైక్‎పై వస్తున్న  భార్య భర్తలు పద్మరెడ్డి, ఈశ్వర్ రెడ్డిలను ఇద్దరు దుండగలు వెంబడించి, పెనుబల్లి మండలం ప్పెనకుంట్ల వద్ద  రాగానే భార్య భర్తలు ప్రయాణిస్తున్న  బైక్‎ను పల్సర్ బైక్ తో ఢీ కొట్టారు.

  భార్య భర్తలపై  దాడి చేసి, పద్మారెడ్డి మెడలోని గోల్డ్​చైన్‎ను లాక్కెళ్లారు. పెనుబల్లి మండలంలో  కారాయిగూడెం, కుప్పెనకుంట్ల గ్రామాల్లో,  కల్లూరు మండలం  ఎన్ఎస్‎పీ  వద్ద చైన్ స్నాచింగ్ జరగడంతో పీఎస్ల్లో కంప్లైట్​చేశారు. కేసు నమెదు చేసుకున్న పోలీసులు దుండగులను పట్టుకునే పనిలో ఉన్నారు.

ALSO READ | భద్రాద్రిటెంఫుల్​ప్రధాన అర్చకుడి సస్పెన్షన్