స్వచ్ఛ ఆటోల కొనుగోలుకు తీర్మానం

 స్వచ్ఛ ఆటోల కొనుగోలుకు తీర్మానం

చొప్పదండి, వెలుగు: చొప్పదండి మున్సిపాలిటీలో రూ.36లక్షలతో 4 స్వచ్ఛ ఆటోలు కొనేందుకు కౌన్సిల్​ తీర్మానం చేసినట్లు చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్​ గుర్రం నీరజ తెలిపారు. శనివారం మున్సిపల్ ఆఫీసులో చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ అధ్యక్షతన జనరల్​బాడీ మీటింగ్​ జరిగింది. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని ఎన్టీఆర్​ చౌరస్తా, తహసీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసు సమీపంలోని పబ్లిక్ టాయిలెట్స్ రిపేర్​ కోసం రూ.2లక్షలు, రూ.13 లక్షలతో డంపింగ్ యార్డు, బయోమైనింగ్, ఎఫ్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ ప్లాంట్ల నిర్వహణ, రూ.13 లక్షలతో 35కేవీ నాన్ డొమెస్టిక్ లోడ్ 63 కేవీఏ డీటీఎస్​ విద్యుత్ సౌకర్యం కల్పించటం, రూ.5లక్షలతో డంపింగ్ యార్డులో డీఆర్​సీసీ షెడ్డు.. తదితర పనులకు కౌన్సిల్​ ఆమోదించినట్లు తెలిపారు. సమావేశంలో వైస్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్​ ఇప్పనపల్లి విజయలక్ష్మి, కమిషనర్​ కె.నాగరాజు, కౌన్సిలర్లు, మేనేజర్ ప్రశాంత్​, పాల్గొన్నారు.