
మరికల్, వెలుగు: మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎంపీ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని ఆ పార్టీ ఎంపీ క్యాండిడేట్ చల్లా వంశీచంద్రెడ్డి కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ది చెందాలంటే కాంగ్రెస్కు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఖాజా, మక్సూద్, మంజూర్, గౌస్, మౌలానా, కాంగ్రెస్ నాయకులు వీరన్న, గొల్ల కృష్ణయ్య, వినీతమ్మ, సూర్యమోహన్రెడ్డి, హరీశ్ పాల్గొన్నారు.