
- గవర్నర్కు చేరిన ఫైల్.. ఆమోదించగానే ఉత్తర్వులు
- లిస్ట్లో అయోధ్య రెడ్డి బోరెడ్డి, పీవీ శ్రీనివాస్రావు, కప్పర
- హరిప్రసాద్, పీఎల్ఎన్ ప్రసాద్, రాములు, వైష్ణవి, పర్వీన్ పేర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ)గా ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డిని ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు సిఫార్సులను గవర్నర్కు పంపినట్లు తెలిసింది. గవర్నర్ ఆమోదం తర్వాత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. సీఐసీతోపాటు రాష్ట్ర సమాచార కమిషన్లో ఖాళీగా ఉన్న మరో ఏడు ఇన్ఫర్మేషన్ కమిషనర్ల నియామకానికి సంబంధించి కూడా ప్రభుత్వం పేర్లను ఖరారు చేసింది.
ఇన్ఫర్మేషన్ కమిషనర్లుగా పీవీ శ్రీనివాస్ రావు, అయోధ్య రెడ్డి బోరెడ్డి, కప్పర హరిప్రసాద్, పీఎల్ఎన్ ప్రసాద్, రాములు, వైష్ణవి, పర్వీన్ మొహిసిని నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో ఖమ్మం జిల్లాకు చెందిన పీవీ శ్రీనివాస్ రావు సీనియర్ జర్నలిస్టు కాగా.. యదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అయోధ్యరెడ్డి సీఎం సీపీఆర్వోగా ఉన్నారు.
ఇక గాంధీ భవన్ పీఆర్వోగా ఉన్న కప్పర హరిప్రసాద్ది సిద్దిపేట జిల్లా కాగా.. పీఎల్ఎన్ ప్రసాద్ పూర్వ నల్గొండ జిల్లా నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన న్యాయవాది. మహబూబ్నగర్ జిల్లా నుంచి రాములు ఎస్సీ సామాజిక వర్గం కాగా.. కమిషనర్లలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మైనార్టీ కోటాలో పర్వీన్ మొహిసిని ప్రభుత్వం ఎంపిక చేసింది. గత రెండేండ్లుగా సమాచార కమిషన్లో కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో దాదాపు 10,688 ఆర్టీఐ అప్పీళ్లు పెండింగ్లో ఉన్నాయి.
ఈ ఆలస్యంపై సుప్రీంకోర్టు 2025 జనవరిలో ఆందోళన వ్యక్తం చేసి, నియామకాలను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే గత కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చే సేందుకు ఎంపిక చేసిన వారి జాబితాను రాష్ట్ర సర్కారు రాజ్భవన్కు పంపింది.