చంద్రుడి మట్టి నమూనాల్లో నీటి ఆనావళ్లు

చంద్రుడి మట్టి నమూనాల్లో నీటి ఆనావళ్లు

2020లో విజయవంతంగా చేపట్టిన చాంగే–5 మిషన్ ద్వారా చంద్రుడి ఉపరితలం నుంచి తీసుకొచ్చిన మట్టి నమూనాలను పరిశీలిస్తున్న బీజింగ్​ నేషనల్​ లేబొరేటరీ ఫర్​ కండెన్స్​డ్​ మ్యాటర్​ ఫిజిక్స్​తోపాటు ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఫిజిక్స్​ పరిశోధకులు వాటిలో నీటి అణువులను గుర్తించారు. జాబిల్లి నుంచి మట్టిని సేకరించిన మూడో దేశంగా చైనా నిలిచింది. 

    చాంగే–5 ద్వారా 2020లో చైనీయులు మట్టి, రాళ్లతో కూడి నమూనాలను తీసుకొచ్చారు. వీటిని సీఏఎస్​తోపాటు మరో రెండు పరిశోధనా సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు విశ్లేషించారు. 
    అమెరికా, రష్యా వ్యోమగాములు కూడా 40 ఏళ్ల క్రితమే చంద్రుడి నుంచి నమూనాలను సేకరించి తీసుకువచ్చారు. 
    2009లో భారత్ ప్రయోగించిన చంద్రయాన్​–1 వ్యోమనౌక కూడా చంద్రుడిపై ఆక్సిజన్​, హైడ్రోజన్​ అణువులు కలసిఇ ఉన్న ఖనిజాలను గుర్తించింది. 2020లో నాసా కూడా చంద్రుడిపై నీటి ఆనవాళ్లను గుర్తించింది.