మహారాష్ట్రలో ప్రభుత్వం మారాల్సిందే : ​ శరద్​ పవార్​

మహారాష్ట్రలో ప్రభుత్వం మారాల్సిందే : ​ శరద్​ పవార్​
  • ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్​ శరద్​ పవార్​

జల్​గావ్: మహారాష్ట్ర ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడాలంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారాల్సిందేనని నేషనలిస్ట్ కాంగ్రెస్ ​పార్టీ(ఎన్సీపీ) చీఫ్​ శరద్ ​పవార్​ అన్నారు. మార్పుతోనే రైతులు, మహిళలు, యువత జీవితాలు ఇంప్రూవ్ అవుతాయన్నారు.

 సోమవారం మహారాష్ట్రలోని జల్​గావ్​ జిల్లా పరోలాలో ఎంవీఏకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో శరద్​ పవార్​ మాట్లాడారు.  రాష్ట్రంలో మహాయుతి కూటమి పాలనలో నిరుద్యోగ సమస్య తోపాటు రైతు ఆత్మహత్యలు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని అన్నారు.  ఎంవీఏ కూటమికే ఓటు వేయాలని  ప్రజలను పవార్​ అభ్యర్థించారు.