
హైదరాబాద్, వెలుగు: ఐఐటీ, ఎన్ఐటీలతో పాటు ఇతర జాతీయ సంస్థల్లో అడ్మిషన్లకు నిర్వహించే జేఈఈ మెయిన్ ఎగ్జామ్ సిలబస్లో స్వల్ప మార్పులు చేసినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం ప్రకటించింది. తాజా సిలబస్ను జేఈఈ తన వెబ్సైట్లో పెట్టింది. మ్యాథ్స్లో ప్రపోర్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ (యాజ్ సొల్యూషన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్)ను పూర్తిగా తొలగించారు.
సెట్స్, రిలేషన్స్, స్టాటిస్టిక్స్, త్రీ డైమెన్షన్, జామెట్రీలో లైన్స్ అండ్ ప్లేన్స్పై కొంత భాగాన్ని కొత్తగా చేర్చారు. ఫిజిక్స్లో యంగ్స్ మాడ్యూల్స్ బై సియర్లస్ మెథడ్ను తీసేశారు. కెమిస్ట్రీలో న్యూక్లియర్ కెమిస్ట్రీ, ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కెమికల్ ఆఫ్ రెస్పిరేషన్ ఆఫ్ మోనో–ఫంక్షనల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఫ్రమ్ బైనరీ మిక్చర్స్ తొలగించారు. వీటితో పాటు పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు.