అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నారు : చంటి క్రాంతికిరణ్‌

అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నారు : చంటి క్రాంతికిరణ్‌

జోగిపేట, వెలుగు :  ఆందోల్​ అభివృద్ధిని చూసి పలువురు బీఆర్‌‌ఎస్​లో చేరుతున్నారని ఎమ్మెల్యే చంటి  క్రాంతి కిరణ్‌ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని అల్మాయిపేట సర్పంచ్‌ బాలమణి రవిశంకర్‌తో పాటు వార్డు సభ్యులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళలు, బీఆర్‌ఎస్​లో చేరారు. ఈ సందర్భంగా క్రాంతి కిరణ్​ మాట్లాడుతూ సీఎం కేసిఆర్‌ నాయకత్వం కావాలని యావత్‌ దేశ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. 

ఈ కార్యక్రమంలో టీఎస్​టీపీసీ చైర్మెన్‌ భిక్షపతి, రాష్ట్ర మార్క్ ఫెడ్​ డైరెక్టర్‌ జగన్మోహన్‌రెడ్డి, డీసీసీబీ మాజీ వైస్‌ చైర్మెన్ జైపాల్‌రెడ్డి,  జోగిపేట ఏఎంసీ చైర్మెన్‌ పల్లె సంజీవయ్య, లక్ష్మీ కాంతారెడ్డి, బాలయ్య,  మహేశ్వర్‌రెడ్డి, లింగన్న, విజయ్,  జహంగీర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.