చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలోని సర్వోదయ సాల్వెంట్ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలను ఎట్టకేలకు ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. మంగళవారం ( ఫిబ్రవరి 4) రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించగా... 5 వతేది తెల్లవారుజామున 3 గంటలకు అదుపులోకి వచ్చాయి. 10 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. సుమారు 6 గంటల పాటు మంటలు చెలరేగాయి.
కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్లు పేలడంతో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చుట్టు పక్కల పరిశ్రమలకు మంటలు వ్యాపించడంతో .. పక్కనున్న రబ్బర్ కంపెనీకి మంటలు అంటుకున్నాయి. దీంతో పొగ, కెమికల్ వాసనతో ఉక్కిరిబిక్కిరైన స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Also Read :- హైదరాబాద్ టూ తిరుపతి.. ఉదయం 5.30కు వెళ్లాల్సిన విమానం
రాచకొండ సీపీ సుధీర్ బాబు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఫైర్సిబ్బందికి సూచనలు ఇస్తూ ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు ఇటు పోలీసు అధికారులు.. అటు ఫైర్ సిబ్బంది తీవ్రంగా కష్టపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు, ఎంత ఆస్తి నష్టం జరిగిందనేది తెలియాల్సి ఉంది.