కూకట్‎పల్లిలో తనిఖీలు: పోలీసుల అదుపులో 31 మంది మహిళలు

 కూకట్‎పల్లిలో తనిఖీలు: పోలీసుల అదుపులో 31 మంది మహిళలు

హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో విమెన్ యాంటి ట్రాఫికింగ్ టీమ్ సెర్చ్ ఆపరేషన్స్ చేసింది. నగరంలోని పలు బస్టాండ్లు, మెట్రో స్టేషన్లలలో తనిఖీలు చేసింది. వ్యభిచారానికి పాల్పడుతున్న 31 మంది మహిళలతో పాటు నలుగురు ట్రాన్స్ జెండర్లను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.