
- మరో వీక్లీ రైలు హాల్టింగ్కు కూడా నిర్ణయం
- పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అభ్యర్థనకు స్పందించిన రైల్వే బోర్డు
కోల్బెల్ట్, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో మంచిర్యాల రైల్వే స్టేషన్లో చెన్నై–జోధ్పూర్ఎక్స్ప్రెస్(06157/06158), ఎంఎస్-బీజీకేటీ వీక్లీ ఎక్స్ప్రెస్ (20625/20626) ప్రయోగాత్మక హాల్టింగ్ మంజూరుకు రైల్వే బోర్డు అంగీకరించింది. ఈ రెండు ఎక్స్ప్రెస్రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని ఈ నెల 10న వంశీకృష్ణ సికింద్రాబాద్ డివిజనల్రైల్వే మేనేజర్ భారతేశ్ కుమార్జైన్కు వినతిప్రతం సమర్పించారు. రైల్వే నిబంధన ప్రకారం స్టాఫేజ్మంజూరుకు అవసరమైన ఆదాయ ప్రమాణాలు సాధించకపోయినప్పటికీ ఎంపీ అభ్యర్థన మేరకు రెండు రైళ్లకు ప్రయోగాత్మక స్టాఫేజ్ మంజూరు విషయాన్ని బోర్డు పరిగణలోకి తీసుకున్నట్లు రైల్వే శాఖ ప్రకటనలో పేర్కొంది.
ఈ రెండు ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పించడం ద్వారా మంచిర్యాల జిల్లా ప్రజలకు ట్రాన్స్పోర్ట్ మరింత మెరుగవుతుందని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల అవసరాలే మా ప్రాధాన్యమని, మంచిర్యాల ప్రజలకు అవసరమైన రైల్వే సదుపాయాలను తీసుకురావడం గర్వకారణంగా ఉందన్నారు. ఇది స్థానిక ప్రజల ప్రయాణ అవసరాలు తీర్చడంలో చాలా ఉపయోగపడుతుందని, ఈ సందర్భంగా రైల్వే బోర్డుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.