చెన్నై: ఇండియా టెన్నిస్ ప్లేయర్, తెలుగు ఆటగాడు సాకేత్ మైనేని, రామ్ కుమార్ రామనాథన్ చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్ మెన్స్ డబుల్స్లో టైటిల్ నిలబెట్టుకోలేకపోయారు.
శనివారం జరిగిన మెన్స్ డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ సాకేత్–రామ్కుమార్ జోడీ 4–6, 4–6తో వరుస సెట్లలో జపాన్కు చెందిన అన్సీడెడ్ ద్వయం షింటరో మొచిజుకి–కైటో ఉయెసుగి చేతిలో పరాజయం పాలైంది.