
ప్రముఖ నటుడు శివాజీ గణేషన్ (Sivaji Ganesan) చెన్నైలో ఉన్న విశాలమైన ఇంటిలో కొంత భాగాన్ని అటాచ్ చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. తమిళ చిత్రం జగజాల కిల్లాడి నిర్మాణం కోసం శివాజీ గణేషన్ మనవడు దుష్యంత్ మరియు ఆయన భార్య అభిరామి తీసుకున్న అప్పులకు సంబంధించిన ఈ కేసులో మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రముఖ నివేదికల ప్రకారం, శివాజీ గణేషన్ మనవడు, నటుడు దుష్యంత్ మరియు అతని భార్య అభిరామి భాగస్వాములుగా ఉన్న ఈసన్ ప్రొడక్షన్స్ అనే సంస్థ, నటుడు విష్ణు విశాల్, నటి నివేదా పేతురాజ్ నటించిన "జగజాల కిల్లాడి" చిత్రాన్ని నిర్మించింది.
ఈ సినిమా నిర్మాణం కోసం, వారు ధనభాగ్యం ఎంటర్ప్రైజెస్ నుంచి రూ. 3.74 కోట్లు అప్పుగా తీసుకున్నారు. ఈ రుణాన్ని 30 శాతం వార్షిక వడ్డీతో తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఈ జంట తమ ఆర్థిక బాధ్యతలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
ఇందుకోసం మధ్యవర్తిగా రిటైర్డ్ న్యాయమూర్తి రవీంద్రన్ను చెన్నై హైకోర్టు నియమించింది. ఈ విషయాన్ని పరిశీలించిన తర్వాత, మధ్యవర్తి జస్టిస్ రవీంద్రన్ మే 4, 2024న, జగజాల కిల్లాడి సినిమా యొక్క అన్ని హక్కులను ధనభాగ్యం ఎంటర్ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్కు అప్పగించాలని, మొత్తం రూ. 9.2 కోట్ల రుణ మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి పొందేందుకు వీలు కల్పించాలని ఆదేశించారు.
ALSO READ : JrNTR: వార్ 2 అప్డేట్.. నాటు నాటుని మించేలా ఎన్టీఆర్, హృతిక్ లపై డ్యాన్స్-ఆఫ్ సీక్వెన్స్
అయితే, సినిమా రైట్స్ తమకు అప్పగించాలని ధనభాగ్యం ఎంటర్ప్రైజెస్ కోరగా, చిత్ర నిర్మాణం పూర్తి కాలేదని నిర్మాతలు తెలిపారు. దీంతో మరోసారి ధనభాగ్యం ఎంటర్ప్రైజెస్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శివాజీ గణేశన్ ఇంటిని జప్తు చేయాలని న్యాయమూర్తి అబ్దుల్ ఖుద్దోస్, లెజెండరీ నటుడు శివాజీ గణేషన్ ఇంట్లో కొంత భాగాన్ని జప్తు చేయాలని ఆదేశించారు.
The Madras High Court has ordered the attachment of a portion of acclaimed actor ‘Sivaji’ Ganesan’s (alias V.C. Ganesan) sprawling bungalow at South Boag Road (now Chevalier Sivaji Ganesan Road) in T. Nagar, Chennai, due to a monetary dispute between a private enterprise and the… pic.twitter.com/SBpOqJs4Im
— The Hindu (@the_hindu) March 3, 2025
ఈసన్ ప్రొడక్షన్స్ సమయం కోరినప్పటికీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయలేదని తెలిపారు. ఇక ఈ ఆర్డర్ గురించి సంబంధిత సబ్ రిజిస్ట్రార్కు తెలియజేయాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు. కేసును మార్చి 5కి అంటే రేపటికి వాయిదా వేశారు.