వధువరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ

వధువరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ

కోల్​బెల్ట్/కోటపల్లి/చెన్నూర్, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం జరిగిన వివాహ వేడుకలు, గృహప్రవేశ కార్యక్రమాల్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. మందమర్రిలోని శివసాయి ఫంక్షన్ ​హాల్​లో రవళి-–సతీశ్, క్యాతనపల్లి మున్సిపాలిటీలోని గద్దెరాగడి ఎన్​వీఆర్​ఫంక్షన్ ​హాల్​లో గాయత్రి-–సతీశ్, భీమా గార్డెన్స్​లో కుర్మ సాగరిక–-శేఖర్, జైపూర్​ మండలం మిట్టపెల్లి(కొమ్ముగూడెం)లో శంకర్-–హిమాణి, చెన్నూర్ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్​లో కోటపెల్లి మండలంలోని నాగంపేట గ్రామానికి చెందిన ఠాకూర్ రాకేశ్ శింగ్–-రమ్య వధూవరులను ఆశీర్వదించారు.

జైపూర్ మండల కాంగ్రెస్ ​లీడర్ ​నవీన్ గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. కోటపల్లి మండలం బోరంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దుర్గం కుభీర్​ ఇటీవల యాక్సిడెంట్​లో చనిపోగా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మంచిర్యాలలో కాంగ్రెస్ లీడర్​బత్తుల శ్రీనివాస్ ​యాదవ్​ తల్లి రాధ దినకర్మకు హాజరయ్యారు.