
- చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయండి
- రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లకు చేరడం హర్షణీయం
- సీఎంకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లేఖ
- ఈ లెక్కన ఎస్సీల వాటా రూ. 54వేల కోట్లు
హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ లో ఎస్సీకు 18% నిధులు కేటాయించాలని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ లో ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు కేటాయించడంతోపాటు బడ్జెట్ కూడా కేటాయిస్తామని ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లకు చేరుకోవడం శుభపరిణామమని అన్నారు.
ALSO READ | అఖిల పక్షానికి కమలం, కారు దూరం.. హాట్ టాపిక్గా రెండు పార్టీల తీరు
ఇందులో 18 శాతం నిధులు అంటే 54 వేల కోట్లను ఎస్సీల అభ్యున్నతికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇది దళితుల ఓట్లను పొందడానికి ఇది ఎంతో ఉపయోగ పడుతుందని అన్నారు. గతంలో ఎస్సీల సంక్షేమానికి 8 వేల కోట్లు తక్కువగా కేటాయించారని గుర్తు చేశారు. ప్రస్తుత బడ్జెట్ లో 54 వేల కోట్లు ఎస్సీలకు కేటాయించేలా ఆర్థిక శాఖను ఆదేశించాలని వివేక్ కోరారు.