
- ఎమ్మెల్యేకు స్వాగతం పలికిన లీడర్లు
కోల్బెల్ట్, వెలుగు: పది రోజుల పాటు విదేశీ పర్యటన ముగించుకొని మంగళవారం హైదరాబాద్ చేరుకున్న చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామికి నియోజకవర్గ కాంగ్రెస్ లీడర్లు ఘనస్వాగతం పలికారు. అఖిల భారత యాదవ సంఘం మంచిర్యాల అధ్యక్షుడు, కాంగ్రెస్ లీడర్ బండి సదానందం అనుచరులతో కలిసి శంషాబాద్ఎయిర్పోర్ట్లో ఎమ్మెల్యే వివేక్కు స్వాగతం పలికారు.
శాలువా కప్పి బొకే అందజేశారు. ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా, రైతుల సంక్షేమం కోసం వివేక్ వెంకటస్వామి కృషి చేస్తున్నారని బండి సదానందం అన్నారు. ఇటీవల అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి చేయూతనందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, రాష్ట్ర లీడర్ దుర్గం నరేశ్, రఘునాథ్రెడ్డి, వెంకటేశ్వర్లు, రవికుమార్ తదితరులున్నారు.