పీసీసీ చీఫ్ను కలిసిన వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి

 పీసీసీ చీఫ్ను కలిసిన వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి

టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను కలిశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. మహేశ్ కుమార్ గౌడ్  ఆయన ఇంటికి  వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 

కాంగ్రెస్ లో ఎన్ఎస్ యూఐ నుంచి టీ పీసీసీ స్థాయికి ఎదిగిన వ్యక్తి మహేశ్ కుమార్ గౌడ్ అని చెప్పారు ఎమ్మెల్యేలు. ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు వివేక్, రాజగోపాల్ రెడ్డి.