చెన్నూరు​లో చెరువు మత్తడి పేల్చేసినోళ్లపై కఠిన చర్యలు :వివేక్ వెంకటస్వామి

చెన్నూరు​లో చెరువు మత్తడి పేల్చేసినోళ్లపై కఠిన చర్యలు :వివేక్ వెంకటస్వామి
  • ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కోల్​బెల్ట్, వెలుగు: చెన్నూరులోని శనిగకుంట చెరువు మత్తడిని డిటోనేటర్లతో పేల్చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆయకట్టు రైతులకు నష్టం జరిగేలా మత్తడిని పేల్చివేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసు అధికారులను ఆదేశించినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సంఘ విద్రోహా చర్యలకు పాల్పడిన వారు ఎవ్వరైనా వదిలిపెట్టేది లేదని, వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

అనారోగ్య కారణాల వల్ల శనిగకుంట చెరువును తాను సందర్శించలేకపోయానని చెప్పారు. చెన్నూరు నియోజకవర్గం పరిధిలో జూదం, ఇతర సంఘ వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి పోలీసులు రేయింబవళ్లు పెట్రోలింగ్ చేయాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో అన్ని వర్గాల సహకారం ఉండాలని పేర్కొన్నారు.